సిరాన్యూస్, ఖానాపూర్
ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసముంటున్న ప్రజలు త్రాగునీటి సమస్య ఉందని మొన్న మున్సిపల్ చైర్మన్ కు తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ రాజూరా సత్యం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ కు సమస్యను వివరించారు. గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉన్న ప్రజల వద్దకు ఎమ్మెల్యే వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ,ఇప్పుడు తాత్కాలికంగా వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేపిస్తామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు జన్నరపు శంకర్ , నాయిని సంతోష్ , పరిమి సురేష్ , షబ్బీర్ పాషా,నాయకులు పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్,మైనార్టీ మండల ప్రసిడెంట్ సలీం ఖాన్, తోట సత్యం, అసిప్ అలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.