సిరాన్యూస్,ఉట్నూర్
సిడం శంభు ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* సిడం శంభు జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ
ఆదివాసుల హక్కులకై పోరాడిన ఉద్యమ నేత, తుడుం దెబ్బ వ్యవస్థాపకులు సిడం శంభు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో సిడం శంభు 6వ వర్ధంతిని పురస్కరించుకొని అయన సమాధితో పాటు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హైమన్ డార్ప్ – బెట్టి ఎలిజిబెత్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ రచించిన పుస్తకాన్ని ప్రముఖలు, కుటుంబ సభ్యులతో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నెలకొన్న పోడు భూముల, అటవి హక్కుల, సాధనకై సిడం శంభు నిరంతరం పోరాటం చేశారని పేర్కొన్నారు.ఆయనతో కలసి అనేక ఉద్యమాల్లో పాల్గొనటం జరిగిందని తెలిపారు. అయన ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరవలేనివని అన్నారు.నేడు ఓ గొప్ప నాయకుడిని కోల్పోయమని అన్నారు.త్వరలో అయన కుటుంబ సభ్యులతో చర్చించి విగ్రహా ఏర్పాటు చేస్తామని,అదే విధంగా కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడుతామన్నారు. సిడం శంభు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం భావితరాలపై ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు,కుటుంబ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.