సిరాన్యూస్, ఇంద్రవెల్లి:
పేదల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని బుద్ధనగర్ కాలనీకి చెందిన శామీమ్ సూల్తానాకు 60వేలు ,అదే విధంగా మెండపల్లి గ్రామానికి చెందిన కే. చంద్రమణికు మంజూరైనా 19వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థికంగా ఎంతగానో లాభం చేకూరుస్తుందన్నారు.రోగి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ…ఆ పెందింటి కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల అభివృద్దే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.