Vedma Bojju Patel: పశువైద్య శిబిరాలనుసద్వినియోగం చేసుకోవాలి

సిరా న్యూస్, ఉట్నూరు
పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
* ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* గాలికుంటు వ్యాధి నివార‌ణా టీకాలు పంపిణీ
పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో పెర్కగూడా గ్రామంలో పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు సూచించే జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సందర్భంగా పశువులకు వ్యాధి టీకాలను వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *