సిరా న్యూస్, కుందుర్పి
ఘనంగా తిమ్మాపురంలో వీరబ్రహ్మేంద్రస్వామి ప్రతిష్ఠ
కంబదూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి నూతన ఆలయంలో వ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బుధవారం గ్రామస్థులందరూ కలిసి కలశపూజ, హోమం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి, అమ్మవారి విగ్రహాలకు జలాభిషేకం, కుంకుమార్చన అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు భోజనం ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.