సిరాన్యూస్, సైదాపూర్
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్, పోలింగ్ సరళి గురించి చర్చించారు.కరీంనగర్ లోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు స్థానిక నాయకులతో సమన్వయం గా పనిచేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావుని అభినందించారు. సీఎంను కలవడం ఆనందంగా ఉందని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.