Velpula Sudhakar: మా భూమి మాకు ఇప్పించాలి: వేల్పుల సుధాకర్

సిరాన్యూస్, భీమాదేవరపల్లి
మా భూమి మాకు ఇప్పించాలి: వేల్పుల సుధాకర్
అక్రమంగా భూమి పట్టా చేసుకున్న‌ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

తమ భూమి అక్రమంగా పట్టా చేయించుకున్న దుర్గాని రవీందర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు సుధాకర్, రాజేందర్, సువర్ణలు పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వేల్పుల సుధాకర్ కుటుంబ సభ్యులకు వ్యవసాయ భూమి ఉంది. తాతల కాలం నుండి కబ్జాలో ఉండి వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. సంవత్సరం క్రితం తమ వ్యవసాయ భూమిని అమ్మకానికి పెట్టగా, దుర్గని రవీందర్ కొనుగోలు చేస్తున్నానని చెప్పి కొన్నారు. మాట్లాడుకున్న‌ విధంగా డబ్బులు కట్టలేదు. ఈ సమయంలోనే డబ్బు పూర్తిగా చెల్లించకుండా దుర్గాన్ని రవీందర్ అక్రమంగా పట్టా ఎక్కించుకున్నారు. తమ భూమి తమకు ఇప్పించి న్యాయం జరిపించాలని వేల్పుల సుధాకర్ కుటుంబ సభ్యులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *