సిరాన్యూస్, ఆదిలాబాద్
కలెక్టర్కు డాక్టర్ వేముగంటి వరప్రసాద్ రావు వినతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ వేముగంటి వరప్రసాద్ రావు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉండడం వలన సిబ్బంది వేతనాలు, అద్దె, ఇతర నిర్వహణ పెను భారంగా మారిందని తెలిపారు. చాలా కాలేజీలు మూత దశలో ఉన్నాయని తెలిపారు.వెంటనే ముఖ్యమంత్రి కనికరం చూపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హనుమాండ్లు, జిల్లా సభ్యులు రాజ్ కిరణ్ రెడ్డి , అనంత్ దేశ్ పాండే, శ్రవణ్, వెంకటేష్ , నర్సింగ్ పాల్గొన్నారు.