సిరాన్యూస్, హన్మకొండ:
వేముల రమేష్ను సన్మానించిన మంత్రులు
హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ ఢీ కన్వెన్షన్ లో సోమవారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ & ఆర్ ఐటీ డిపార్ట్మెంట్ స్పోక్స్ పర్సన్ వేముల రమేష్ అడ్వకేట్ పాల్గొన్నారు. ఆయనకి రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శాలువాలతో సన్మానించారు. అనంతరం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేముల రమేష్ మాట్లాడుతూ తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు.