సిరాన్యూస్,సైదాపూర్:
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడి బరిలో వేముల సాయికుమార్
సైదాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో వేముల సాయికుమార్ ఉన్నారు. సోమవారం నాటికి నామినేషన్లు పూర్తయ్యాయి. అధ్యక్ష పదవికి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరికైతే ఆన్లైన్లో ఎక్కువ ఓటింగ్ వస్తుందో వారే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మూడు సంవత్సరాలు కొనసాగుతారు. మండల కేంద్రానికి చెందిన వేముల సాయికుమార్, దండ రామ్ రెడ్డి, అసరి రఘు, బొడిగ చంద్రమౌళి, బానోత్ తిరుపతి, సుంకరి త్రినేష్, బరిలో ఉన్నారు. వేముల సాయికుమార్ గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేశారు. పొన్నం ప్రభాకర్ ఎంపీ గెలుపులో కార్యకర్తలను సమన్యాయం చేసి తన వంతు కృషి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ గెలుపులో అహర్నిశలు కష్టపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున భారీలో ఉన్న వారిని, గెలుపుకు తన వంతు పాత్ర వహించి పూర్వం మండలంలో పార్టీ కార్యకర్తల మధ్య సంకేత లోపించడంతో అందరినీ సమన్యాయం చేసారు.