వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల్లో బదిలీల గుబులు

ఆప్షన్లు పెట్టుకోవాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు
ఆప్షన్ల వెతుకులాటలో ఆలయ ఉద్యోగులు
వేములవాడ కొండగట్టు ధర్మపురి బాసర కొమరవెల్లి సికింద్రాబాద్ గణేష్ దేవాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం
 సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగులు బదిలీపై వెళ్లేందుకు రాష్ట్ర దేవదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఏళ్ల తరబడి ఆలయంలో పాతుకుపోయిన ఉద్యోగులు రాజన్నాలయాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిక్స్ ఏ దేవాలయాల్లో బదిలీపై వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. రాజన్న ఆలయ ఉద్యోగు పేరు హోదా పుట్టిన తేదీ ఆలయంలో జాయిన్ అయిన తేదీ సర్వీస్ కాలం రిటైర్మెంట్ తేదీలతో పాటు పూర్తి వివరాలను కోరుతూ ఆలయ ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలను అందజేశారు..
ఆలయ ఉద్యోగులు గత రెండు రోజులుగా ఆప్షన్ పత్రాలతో తమ వివరాలను పూర్తిచేసి ఏ ఆలయానికి వెళితే బాగుంటుందని గుసగుసలాడడంతో బిజీగా ఉన్నారు. రాజన్న ఆలయంలోని విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను పరిగణలోకి తీసుకొని ఆయా విభాగాల్లోని 40 శాతం ఉద్యోగులను బదిలీపై ఇతర దేవాలయాలకు పంపించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. సంవత్సరంలోపు రిటైర్మెంట్ గల ఉద్యోగులను బదిలీల మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఉద్యోగులు తాము ఆసక్తి చూపుతున్న ఐదు దేవాలయాల్లో ఆప్షన్లు పెట్టుకునే వెసులుబాటును కల్పించారు.
మిగతా ఉద్యోగులు రాజన్న ఆలయానికి దగ్గరగా ఉన్న కొండగట్టు కొమరవెల్లి దేవాలయాలకు వెళ్లడానికి మొదటి రెండు ఆప్షన్లో ఇస్తున్నట్లు చెబుతున్నారు. బాసర, యాదగిరిగుట్ట,భద్రాచలం సికింద్రాబాద్లోని గణేష్ మహంకాళి ఆలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపగా మరి కొంతమంది ఇక్కడే ఉండేందుకు పైరవీలు ముమ్మరం చేశారు. ఏది ఏమైనప్పటికీ రాజన్న ఆలయంలోని అందరు ఉద్యోగులను బదిలీ చేస్తే అడ్మినిస్ట్రేషన్ లోపం రావడంతో సమస్యలు తలెత్తి ఇబ్బందికరంగా మారుతుందని విమర్శలు సైతం ఆలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *