సిరాన్యూస్, బోథ్
ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలి
* జక్కుల వెంకటేష్
ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని జక్కుల వెంకటేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నాగ భూషణం మెమోరియల్ హైస్కూల్ లో, పార్ది బి ఆశ్రమ ఉన్నత పాఠశాల లో మంగళవారం ప్రకృతి తో స్నేహం – పక్షులకు సహాయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కుల వెంకటేష్ మాట్లాడుతూ మనిషి తనకు అవసరం ఉన్న ప్రతి ఒక్కటి ప్రకృతి నుండి తీసుకుంటున్నాడు అని, అలాంటి ప్రకృతి కొన్ని మానవ తప్పిదాల వల్ల ధ్వంసమవుతుందని తెలిపారు.నాడు మన పూర్వికులు ఇండ్లలో కొన్ని మొక్కలు, చెట్లు, పెంపుడు పక్షులు, పెంపుడు జంతువులు ఉంచి ప్రకృతి తో స్నేహం చేస్తూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాంగా, ధృడంగా ఉండేవారు తెలిపారు. కానీ ఇలాంటివి ఇప్పుడు తగ్గాయి అని, ప్రకృతి తో ప్రేమాను బంధాలు తగ్గడం వల్లనే చిన్న వయస్సులోనే రోగాలు వస్తున్నాయని తెలిపారు. పారిశ్రామికీకరణ, శాస్త్ర సాంకేతికత అభివృద్ధి తో పాటు ప్రకృతి కూడా బాగుండాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం, డీజే శబ్దాలు, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్ల శబ్దల కు దూరంగా ఉండాలని తెలిపారు. పక్షులకు, కోతులకు, ఆవులకు, మూగ జీవాలకు నీరు, ఆహారం, గూడు ఏర్పాటు చేయాలన్నారు.నీటి వనరులు పొదుపుగా వాడుతూ రక్షించుకోవాలని సూచించారు.కార్యక్రమాల లో నాగ భూషణం మెమోరియల్ ప్రిన్సిపాల్ కిషోర్, ఉపాధ్యాయ సిబ్బంది, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమన్న, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.