సిరాన్యూస్, బోథ్
కాలుష్య రహిత సమాజాన్నిఅందిద్దాం
* పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేష్
* విజ్ఞాన్ పాఠశాలలో పిచ్చుకల నీటి తొట్టెల పై అవగాహన
రాబోవు తరాల వారి కోసం కాలుష్యరహిత సమాజాన్ని అందించాల్సిన అవసరం మనందరిపై ఉందని పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేష్ పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో పక్షులకు నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని కోరుతూ పాఠశాల యాజమాన్యానికి నీటి పొట్టిలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో పక్షులకు తాగునీటి అవసరాలు తీర్చాలన్నారు. సమాజంలో పక్షుల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఉండే విధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. డీజే రహిత గ్రామాలు కావాలని, టీజర్ వల్ల జరిగే అనర్థాలను వివరించారు. అన్ని గ్రామాలలో పశువులకు సైతం నీటితో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బద్దం పురుషోత్తం రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.