సిరా న్యూస్,శ్రీశైలం;
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున భక్తులకు వసతీ గదులనునిర్మించేందుకు శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సహకరించేందు సిద్దంగా ఉన్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ధర్మారెడ్డి అన్నారు. శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలతిరుపతి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారినికోరుకున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అన్నారుముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజు సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరంఅర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.మయూర వాహానంపై మల్లేశుడుల్గవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లి కార్జునస్వామి మయూర వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయంనుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలోఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలివెళ్లారు.రాజగోపురం గుండ మయూర వాహనం స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరించారు. మయూర వాహానంపై స్వామిఅమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈవాహనసేవ పూజ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.