Vennampally: వెన్నంపల్లిలో ఘ‌నంగా జగ్జీవన్ రామ్ జ‌యంతి

సిరాన్యూస్‌, సైదాపూర్:
వెన్నంపల్లిలో ఘ‌నంగా జగ్జీవన్ రామ్ జ‌యంతి

భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 116 జయంతి వేడుకలు శుక్ర‌వారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ప‌లువురు అంబేద్కర్ విగ్రహం, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంత‌రం వారు మాట్లాడుతూ ఉప ప్రధాని, కార్మిక శాఖ మంత్రిగా దేశ అభివృద్ధి ప్రధాతగా బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమ‌న్నారు. బడుగు, బలహీన వర్గాల ఆషాజ్యోతి, నిరంతర కృషీవలుడు, భారతదేశ స్వరాజ్యంతో పాటు ఈ దేశ పునరనిర్మాణంలో ఏంతో ముఖ్య పాత్ర పోషించారన్నారని, మొదటిసారి అంటరానితనం, అణచివేతలకు గురైన దళితుల పక్షాన నిలబడి కుల వివక్షపై ఆగ్రహించిన తొలి నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ అని అన్నారు. కార్యక్రమంలో మొలుగూరి అశోక్, మారపాక తిరుపతి, కుల సంఘం అధ్యక్షుడు సంఘాల‌ తిరుపతి, మాజీ సర్పంచ్ మొలుగూరి కొమురయ్య, మాజీ ఎంపిటిసి పార్కల రమేష్ , మొలుగూరి అయిలయ్య, కనకం శ్రీనివాస్, మొలుగూరి వెంకటయ్య, పొడిశెట్టి వెంకటయ్య, మొలుగూరి సమ్మయ్య, మొలుగూరి సంపత్, మొలుగూరి తిరుపతి,శంకర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *