సిరాన్యూస్, సైదాపూర్
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం…
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో శివాలయం లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరిగింది.వేద పండితులు మంత్రోచ్ఛారణలతో పూజలు జరిపించారు.ఈ కార్యక్రమంలో మహిళలు శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలు, పూలు పండ్లు సమర్పించారు. శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఎల్లప్పుడు ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. గ్రామంలో సీతారామ ప్రతిమలను పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్ళారు.సీతారాముల దాంపత్య జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు, యువతీ ,యువకులు నాయకులు .పెద్ద ఎత్తున పాల్గొన్నారు.