సిరాన్యూస్, సైదాపూర్:
వెన్నంపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం మాడ సంజీవ్ రెడ్డికి గ్రామశాఖ అధ్యక్షుడు మారూపాక తిరుపతి ఆధ్వర్యంలో 11వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యరీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిరంతరం సేవలు ఎప్పటికీ కొనసాగుతుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పొరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిల్ విండో మాజీ చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, ఆబ్బిడి కొండాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పర్కాల రమేష్, పేరాల ప్రభాకర్ రావు, మొలుగూరి ఐలయ్య, బీస నర్సయ్య, కొరిమె రమణ తదితరులు పాల్గొన్నారు.