సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
వెన్నంపల్లిలో విద్యుత్ షాక్తో ఎద్దు మృతి
విద్యుత్ షాక్తో ఓ ఎద్దు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం… వెన్నంపల్లి గ్రామానికి చెందిన రైతు బండి రమేష్ తన ఎద్దులతో వ్యవసాయ పనిలో పత్తికి గుంటుకు కొడుతుండగా పత్తిలో ఉన్న విద్యుత్ పోల్ యొక్క సపోర్టు తీగకు విద్యుత్ సరఫరా అయ్యింది. సపోర్టు తీగ ఎద్దు తాకగా ఎద్దు అక్కడికి అక్కడే ఎద్దు మృతి చెందింది. సుమారు ఎద్దు విలువ రూ.50వేల వరకు ఉంటుందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.