సిరా న్యూస్, సైదాపూర్:
వెన్నంపల్లి గ్రామంలో ఘనంగా భారతరత్న డా” బాబా
సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.అయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెన్నంపల్లి అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అస్పృశ్యత, అంటరానితనం గురించి ఆయన అహర్నిశలు పోరాటం చేసారని. భౌతిక ప్రపంచం కోసమో సంపద అధికారం కోసమో కాదని స్వేచ్ఛ కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. దేశంలో ఎక్కువగా పేదరికం కన్నా కుల వివక్షత అనే భయంకర చావుకేకలు ఉండేవి అన్నారు. మహిళలు,కార్మికులు, పేదలకోసం అలుపెరుగని పోరాటం చేసి, కోట్లమంది తలరాతలను మార్చిన మహనీయుడు అన్నారు. ఎన్నో అవమానాలను దిగమింగి రాజ్యాంగ కమిటీకి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగి, దేశానికి అయన అందించిన సేవలను నేటి తరానికి తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్క యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు అధ్యక్షులు మొలుగూరి సంపత్, ప్రధాన కార్యదర్శి మారుపాక తిరుపతి, ఉపాధ్యక్షులు కనకం అజయ్, మొలుగూరి తిరుపతి,సంగాల తిరుపతి, సంగాల రవి కుమార్, కోశాధికారి సంగాల వినయ్ కుమార్, కార్యదర్శులు సంగాల రమేష్, మొలుగూరి ప్రభాకర్, మొలుగూరి అశోక్,కనకం శ్రీనివాస్ కొంకట సునీల్, సహాయ కార్యదర్శులు మొలుగూరి రాజ్ కుమార్, మారుపాక సుమన్, మొలుగూరి రాకేష్, మొలుగూరి ఐలయ్య, సంగాల మహేష్, కార్య నిర్వాహాకులు మొలుగూరి స్వామి, మారుపాక అర్జున్, మొలుగూరి వంశీ, మొలుగూరి మొగిళి, మొలుగూరి సాయి కుమార్, దప్పు హరీష్, గౌరవ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ పర్కాల రమేష్,హరిప్రసాద్, మ్యాదరి రమేష్, చింతలపల్లి రవి, గుంటి హరిహరణ్, గ్రామప్రజలు, యువత మహిళలు, పాల్గొన్నారు.