సిరాన్యూస్, ఖానాపూర్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఒకటో వార్డులో శాంతి నగర్ కాలనీలో మంగళవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూలర్లు , పాత టైర్లు పనికిరాని వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. వర్షపు నీటిని తొలగించాలని, లేకపోతే దోమలు ఏర్పడి అనారోగ్యానికి గురి చేస్తాయని తెలిపారు. సీజనల్ వ్యాధులకు గురి కాకుండా చూసుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు వార్డు ఆఫీసర్ సురేందర్ , హాస్పిటల్ సిబ్బంది ఆశా వర్కర్లు, మెప్మా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.