సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రజా భవన్ కు డీఎస్సీ 2008 బాధితులు మంగళవారం నాడు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ కోరారు. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన సుమారు 300 మంది పైగా అభ్యర్థులు ప్రజా భవన్ కు చేరుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తు చేసారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి జీవితాల్లో వెలుగు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. డీఎస్సీ 2008 కి చెందిన వెయ్యి మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.