Vidwan Reddy: బీఆర్ఎస్‌ టౌన్ అధ్యక్షులుగా కూతురు విధ్వాన్ రెడ్డి 

సిరాన్యూస్‌, సైదాపూర్
బీఆర్ఎస్‌ టౌన్ అధ్యక్షులుగా కూతురు విధ్వాన్ రెడ్డి 
భారత రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల టౌన్ పార్టీ అధ్యక్షులుగా కూతురువిద్వాన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నియమించారు. కార్యదర్శిగా పైడిపల్లి రవీందర్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ గా పోడిశెట్టి కొమురయ్య,కోశాధికారి అనగోని వీరన్న గౌడ్ ను నియమించారు. ఈ సంద‌ర్భంగా కూతురు విధ్వాన్ రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమకు బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీ కోసం తాము అహర్నిశలు కష్టపడతామని పార్టీని గొప్పగా అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్తామని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *