సిరాన్యూస్, ఆదిలాబాద్
జాతీయ జెండా ప్రతిష్టతను కాపాడాలి
* బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ
* కలెక్టర్కు వినతి పత్రం అందజేత
జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇంటింటా ఎగరేసిన జాతీయ జెండాలు చినిగిపోతున్నాయని, వెంటనే వాటిని తొలగించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ రాజర్షి షా ను కలిసి వినతిపత్రం అందచేశారు. పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయడం స్వాగతించ దగ్గ విషయమే అయినప్పటికీ, జెండాలను తొలగించకపోవడంతో చినిగిపోతున్నాయని కలెక్టర్ కు వివరించారు. ఇందుకు కలెక్టర్ స్పందించి త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజ్జగిరి నారాయణ మాట్లాడుతూ.. అజదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇంటింటా ఎగరేసిన జాతీయ జెండాలను ఇప్పటికీ తీసివేయలేదని అన్నారు. ప్రస్తుతం అవి చినిగిపోతున్నాయని పేర్కొన్నారు. జెండా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఆర్ అండ్ బీ వద్ద ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను సైతం ప్రస్తుతం తొలగించారని, వెంటనే జెండాను ఏర్పాటు చేయాలనీ కోరినట్లు వివరించారు. ఈ విషయాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సంతోష్, నేరటి ఉదయ్ కిరణ్, గెడ్డం రాము, కుమ్రా రాజు, మర్సకోల బాపూరావు, రాజు తదితరులు ఉన్నారు