సిరా న్యూస్, అనంతపురం
ఉద్యోగుల కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయాలి
* ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్
రాష్ట్రం లో సార్వతిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వివిధ వర్గాలకు డిక్లరేషన్ లు ప్రకటించినట్లుగానే ఉద్యోగుల డిక్లరేషన్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్ల పల్లి విజయ్ భాస్కర్ వివిధ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం అనంతపురం లో ఆయన మాట్లాడుతూ తమ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఏర్పడితే ఐదు ఏళ్లలో ఉద్యోగుల కొరకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారో , ఉద్యోగుల సమస్య ల పరిష్కారం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, సమస్య పరిష్కారం కోసం ఎంత కాల వ్యవధి అవసరమో తదితర ప్రధాన వివరాలతో కూడిన ప్రత్యేక మేనిఫెస్టో ను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు ప్రకటించిన డిక్లరేషన్ ను ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు నిబద్దతతో అమలు చేస్తే ప్రధాన సమస్యలపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం తరచూ సమావేశాలు, చర్చలు, నిర్వహించాల్సిన అవసరం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 11వపి ఆర్ సి, డి ఏ , ఏ పి జి ఎల్ ఐ, పి ఎఫ్ బకాయిలు, సరెండర్ లీవ్స్, టి ఏ అలవెన్స్ బకాయిలు ఇలా ఉద్యోగులకు దాదాపు 18 వేల కోట్ల వరకు చెల్లించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసారు.