పద్మారావునగర్ నుంచి సోమవారం విజయ సంకల్ప యాత్ర

సిరాన్యూస్,సికింద్రాబాద్;
సోమవారం ఉదయం పద్మారావు నగర్ స్వరాజ్య ప్రింటర్స్ నుండి విజయ సంకల్ప బసు యాత్ర ప్రారంభమవుతుందని సికింద్రాబాద్, మహంకాళి జిల్లా బీజేపీ అద్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ తెలిపారు. బస్ యాత్ర విజయవంతం కోసం ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా శ్యామ్ సుందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం కోసమే ఈ విజయ సంకల్ప యాత్ర అని శ్యామ్ స్పష్టం చేశారు. ఈ యాత్రలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని సందేశం ఇస్తారని పేర్కొన్నారు. జటిల సమస్యలను పారిష్కరించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలను మోడీ ప్రవేశ పెట్టారని వివరించారు. ఈ విషయాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకు వెళ్లి మళ్ళీ మోడీ దేశానికి ప్రధాని కావల్సిన అవశ్యతను స్పష్టం చేస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *