సిరా న్యూస్, పెద్దపల్లి
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
* పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
* పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఓదెల మండలంలోని గురువారం పలు గ్రామాలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు. మండలంలోని లంబాడితండ, నాంసానిపల్లి , అబ్బిడిపల్లి, బీమరపల్లి గ్రామాల్లో నూతన అంతర్గత సీ.సీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి. ఎంపీ ఓ. ఎంపీడీవో జీ. తిరుపతి ఎమ్మార్వో యాకన్న. ఏఈ సమ్మిరెడ్డి.రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్. ఎంపీ ఓ. కాంగ్రెస్ పార్టీ ఓదెల మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, డైరెక్టర్లు, గోపు నారాయణరెడ్డి . కృష్ణారెడ్డి మాజీ సర్పంచులు, మాజీ పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ .మాజీ ఎంపిటిసిలు వీరవెన శంకర్. నిమ్మ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.