Vijaya Ramana Rao: సంక్షేమ‌ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోండి

సిరా న్యూస్, ఓదెల
సంక్షేమ‌ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోండి
* పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు
* గృహ జ్యోతి పథకం ప్రారంభం
ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అన్నారు. గురువారం ఓదెల మండలం,రూప్ నారాయణపేట గ్రామంలో 6 గ్యారంటీల్లో భాగంగా గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయ‌న‌ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు పట్టణాల వలె అభివృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశారని , మిగతా గ్యారంటీలు విడుదల వారిగా అమలు చేస్తామని అన్నారు. ఈనెల 11 నుండి గృహలక్ష్మి పథకంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి,  సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి. ఎంపీపీ కూనారపు రేణుకా దేవి, ఎమ్మార్వో యాకయ్య. ఎంపీడీవో జి.తిరుపతి, చీకట్ల మొండయ్య.నరసింహారెడ్డి , రంగు మల్లేష్ గౌడ్, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచ్ అంకం రమేష్ , ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *