Vijayaraman Rao: ఇల్లందుల శాంతయ్య కు సంస్మరణ సభ

సిరాన్యూస్‌, ఓదెల
ఇల్లందుల శాంతయ్య కు సంస్మరణ సభ
* కుటుంబ స‌భ్యుల‌ను స‌న్మానించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

ఓదెల కాల్వశ్రీరాంపూర్ మండలం, పందిల్ల గ్రామానికి చెందిన ఇల్లందుల శాంతయ్య ఇటీవ‌ల‌ మరణించడంతో సదాశయ ఫౌండేషన్ వారు శాంతయ్య కుటుంబ సభ్యులను సంప్రదించి దేహ దానంపై అవగాహన కలిపించారు. శాంతయ్య దేహాన్ని ప్రతిమ కళాశాలకు డొనేషన్ వారి కుటుంబ సభ్యుల చేత దానం చేశారు. శాంతయ్యని స్మరించుకుంటూ రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. వారి ఆత్మకు శాంతి కలగాని కోరారు. అలాగే వారి కుటుంబ సభ్యులు అయిన కూతురు, అల్లుడు, మనవరాలు ముందుకు వచ్చి దేహాని దానం చేసినందుకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అభినంధించారు. ఎమ్మెల్యే విజయరమణ రావు శాంతయ్య కుటుంబ సభ్యులకు శాలువాలతో సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఇల్లందుల శాంతయ్య, సమాజ హితాన్ని కోరి వేల కట్టలేని శరీరాన్ని మరణానంతరం మట్టిలో వృథాపోకుండా దేహ దానం చేసి వైద్య విద్యార్థుల పరిశోధనకు తోడ్పడిన వీరికి, సహకరించిన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సదాశయ ఫౌండేషన్ వారు మరిన్ని మంచి కార్యక్రమలు చెప్పట్టాలని, నేత్ర, దేహ దానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలుపుతూ వారి సేవలు సమాజానికి చాలా అవసరం అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పందిల్ల గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు . సదాశివ ఫౌండేషన్ సభ్యులు క్యాతం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *