సిరాన్యూస్, ఓదెల
బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం, గూడెం గ్రామంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టపానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొని బోనం ఎత్తుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ గూడెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో ప్రజలం దరూ సుఖశాంతులతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.