జనం మడుగు గ్రామంలో విజయసాయి ప్రచారం

సిరా న్యూస్,కోవూరు;
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జనం మడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అడుగుపెట్టిన ప్రసన్న విజయ సాయి రెడ్డి లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరులో నా ఇల్లు ఉంది.. నా ఇంటికి వచ్చిన ఎస్సీ ఎస్టీ బిజీ ముస్లిం మైనారిటీలను పక్కన కూర్చుని పెట్టుకుని మాట్లాడే సంస్కారమైన వ్యక్తినని గుర్తు చేశారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తప్పు చేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డికి ఫ్యాను గుర్తుపై ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *