సిరాన్యూస్, ఓదెల
వికలాంగురాలికి 50కిలోల బియ్యం పంపిణీ : విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి
పెద్దపల్లి పట్టణంలోని 8వ వార్డు కు చెందిన వికలాంగురాలు సల్మా సుల్తానాకు 50కిలోల బియ్యాన్ని విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి అందజేశారు. ఈసందర్బంగా విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే విజ్జన్న పై అభిమానం తో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి మేరాజ్, బాబా ఖాన్, అహ్మద్ , షఫీ పాల్గొన్నారు.