సిరాన్యూస్, బేల
గెడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించండి
బీజేపీ నాయకులు విలాస్ రెడ్డి
బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గెడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రిటర్మెంట్ మేనేజర్, బీజేపీ నాయకులు విలాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని గురువారం బీజేపీ నాయకులు బేల కాలనీలలో వీధుల గుండా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రిటర్మెంట్ మేనేజర్ బీజేపీ నాయకులు విలాస్ రెడ్డి మాట్లాడారు. గెడం నగేష్ను గెలిపించి నరేంద్రమోడీకి బహుమతి కేంద్రానికి పంపిద్దామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రే, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జ్యోతి రెడ్డి, మండల అధ్యక్షుడు దత్తా నిక్కం, మాజీ సర్పంచ్ ఇంద్రశేఖర్, పొత్ రాజ్ నవీన్, సందీప్ ఠాక్రే, రాము బర్కడే, నారాయణ, తదితరులు పాల్గొన్నారు