సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి రెండవరోజు కైలాసవాహనంపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీప కాంతులతో ముస్తాబైంది ఉగాది మహోత్సవాలలో రెండవరోజు శ్రీశైల బ్రమరాంబాదేవి మహాదుర్గ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో కైలాసవాహనంపై ఉన్న స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదపండితులు ఈఓ పెద్దిరాజు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు గ్రామోత్సవానికి భయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు గొరవయ్యల నృత్యాలు, కన్నడిగుల ఆటపాటలు, పులిబొమ్మల వేషాలు, కోలాటాలు, కన్నడిగుల నృత్యాలు డప్పు చప్పుడ్లు బ్యాండ్ వాయిద్యాలతో, భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అంకాలమ్మగుడి నంది మండపం మీదుగా స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది లక్షలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు…