సిరా న్యూస్,మంగళగిరి;
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనుల్ని గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గ్రామీణ ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ పకడ్పందీగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేసాం. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని, ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పనులు చేపట్టేలా గ్రామ సభల్లో చర్చించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చుతున్నాం. ప్రతీ రూపాయి బాధ్యతతోనే వ్యయం చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలి. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలుపై బాధ్యత తీసుకోవాలని అన్నారు.