సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం పాలసముద్రం గంగమ్మ జాతర అంబలి తాగి 50 మంది అస్వస్థత గురయ్యారు. వాంతులు విరేచనాలు ఎక్కువ కావడంతో వివిధ ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యం మెరుగుపడడంతో గ్రామస్తులు ఇళ్లకు చేరారు.అధికారులు త్రాగునీరు కలుషితమా లేక వేరే ఏదైనా కారణమా అని పరిశీలిస్తున్నారు.
===