Vinod Kumar:పార్లమెంటు ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయే

సిరాన్యూస్‌, సైదాపూర్
పార్లమెంటు ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయే
* మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్
* 12న కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ స‌భ‌
పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి ఎగిరేది గులాబీ జెండాయేన‌ని మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సైదాపూర్ మండల కేంద్రంలో మంగళవారం భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 12న కరీంనగర్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ప్రతి ఒక్క కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేవారి జాబితాను బీఆర్ఎస్ పార్టీ నిన్న ప్రకటించిన నేపథ్యంలో నేడు మంగళవారం రోజున మొదటి సమావేశం సైదాపూర్ మండల కేంద్రంలో పెట్టడం పట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఫుల్ జోష్ కనిపిస్తుందని అయన ఆనందం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్క అంశాన్ని నేను సవాల్ గా తీసుకున్నానని, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దానని, కరీంనగర్ జిల్లా కి బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ చేసింది ఏమీ లేదని, అంత శూన్యమని అన్నారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి కూడా జిల్లాని అభివృద్ధి చేయడంలో నిధులు తెచ్చే విషయాల్లో పూర్తిగా విఫలమయ్యాడని,తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ టు వరంగల్ ఫోర్వే లైన్ సిద్దిపేటకు రైల్వే ట్రాక్ అమలు అయిందని జిల్లా ప్రజలు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్ జిల్లా ప్రజలను బండి సంజయ్ ఓట్లు అడుగుతున్నాడని, కేంద్రంలో బిజెపి పార్టీ ఉండి కూడా జిల్లాని అభివృద్ధి చేయలేదని జిల్లాల విభజన తర్వాత ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాలలు తీసుకురాలేదని, ఉపాధి హామీ పనుల వేతనాలలో చాలా ఆలస్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు.ఇక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరోగ్యారెంటీల అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందని ఇచ్చిన ఆరుగ్యారెంటీలలో కోతలు అడ్డంకులు విధిస్తున్నారని, కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని గడిచిన మూడు నెలల్లోనే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఆ పార్టీ మూటగట్టుకుందని అన్నారు. రైతులకి సకాలంలో నీళ్ల సదుపాయం అందించక పంట పొలాలు ఎండి, నేలలు నెర్రలు బారి పశువులకు పాశుగ్రాసంగా మారి రైతన్నకు త్రీవ్ర నష్టం జరుగుతుంది అని, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న కోపంతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని సకాలంలో నీళ్లు అందించి వారిని ఆదుకోవాలని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని అన్నారు.వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తన గెలుపు ఖాయమని కరీంనగర్ జిల్లాలో ఈసారి ఎగిరేది పక్కా బీఆర్ఎస్ జెండా అని వినోద్ కుమార్ అన్నారు. రాజకీయరంగంలో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఏ ఒక్క కార్యకర్త నిరాశ నిస్పృహలకు లోను కావద్దని బీఆర్ఎస్ కార్యకర్తలే పార్టీకి ముఖ్య బలమని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య,ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి,జిల్లా వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, బిల్లా వెంకట్ రెడ్డి,కొత్త తిరుపతి రెడ్డి,గవ్వ వంశీధర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప్ సింగ్,కొండ గణేష్, అబ్బిడి పద్మ రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి,ఇమామ్,దేవక్క,సునీత, రాజేశ్వర్ రెడ్డి,ఓదెలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *