Vinod Kumar:శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆదిలాబాద్ ఆర్డీఓ

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆదిలాబాద్ ఆర్డీఓ
ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ ఆర్డీఓ టీ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. ఈసంద‌ర్భంగా ఆర్డీఓకు ఆలయ అర్చకులు , ఈఓ వామన్ రావు ఆహ్వానించి ఆలయ చరిత్రను వివరించారు .అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందిచారు. ఆర్డీఓ ఆలయ లోపల కూర్చోడానికి ఏర్పాటు చేసిన 1300 సం క్రితం నాటి రాతి బల్ల పైన సరదగా కూర్చొని వారి చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో మనుషులు 8-9 ఫీట్ల ఎత్తుగా ఉండేవారు వారికి తగ్గట్టు ఇంత ఎత్తులో కూర్చోడానికి ఇలా నిర్మించారూ అని వాక్యానించారు.
వారివెంట జైనాథ్ ఎంఆర్ ఎం శ్యాంసుందర్ ఉన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *