సిరాన్యూస్, బేల
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్ జిల్లా ఆర్డిఓ వినోద్ కుమార్
ఎన్నికల విధుల్లో భాగంగా బీ ఎల్ ఓ లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా ఆర్. డి. ఓ వినోద్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ బేల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ తో కలిసి బీ ఎల్ ఓ లకు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్ డి ఓ వినోద్ కుమార్ మాట్లాడుతు ఎన్నికల కోడ్ అమలులో నియమ నిభందనలు పాటించాలన్నారు. ఫైనల్ ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు అయిన లేనట్లయితే వారి వద్ద నుండి ఫారం 6 తీసుకొని వెంటనే నమోదు చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలో అర్హత కలిగిన ప్రతి వ్యక్తి పేరు తప్పని సరిగా నమోదు అయి ఉండాలని సూచించారు. ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశ నిర్దేశం చేశారు. అర్హులైన వారికి ఓటుకు అవకాశం కల్పించాలని,అది పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని సవివరంగా బీ ఎల్ ఓ లకు వివరించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కి ఆదేశించారు.ఈ సమావేశం లో తహసీల్దార్ సవాయి సింగ్ , నాయబ్ తహశీల్దార్, సూపర్ వైజర్స్, బీ ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.