కేసీఆర్ ను గద్దె దింపడంలో వైస్సార్ టీపిది కీలక పాత్ర

సిరా న్యూస్,ఇడుపుల పాయ;
వైస్సార్ టీపి పార్టీ అధినేత్రి షర్మిలా రెడ్డి కుటుంబ సమేతంగా ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచారు. షర్మిల మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వైఎస్సార్ తో పాటుప్రజలందరి దీవెనలు కొత్త దంపతులపై ఉండాలి. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. ఇవ్వాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది.కేసీఅర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైస్సార్ టీపి చాలా పెద్ద పాత్ర పోషించిందని అన్నారు.31 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 10 వేల లోపు మెజారిటీతోనే గెలిచారు. దీనికి కారణం వైఎస్సార్ తెలంగాణపార్టీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడమే. వైఎస్సార్ టీపి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కి ఇబ్బంది అయి ఉండేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ త్యాగానికి విలువ కూడాఉంది. మా త్యాగానికి విలువ నిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ లో చేరడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సెక్యులర్ పార్టీ. ప్రతి ఒక్కరికీ
భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *