సిరాన్యూస్, బోథ్
మర్సకోల లక్ష్మణ్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
* బోథ్ డివిజన్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు
ఆదివాసులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ బోథ్ డివిజన్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు అన్నారు.ఆదిలాబాద్ జిల్లా బోథ్లోని ఆదివాసీ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతున్న ఈ నెల 13న జైనూరు మండల కేంద్రంలో అమాయక ఆదివాసి యువకుల పైన ఒక వర్గానికి చెందిన వారు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆదివాసీ యువకుడు అయినా మర్సకోల లక్ష్మణ్ ను తీవ్రంగా గాయపరచడం క్షమించరానిదని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కనక అమృత రావు, తుడుందెబ్బ జిల్లా కమిటీ సలహాదారు పందరం శంకర్, బోథ్ మండల కమిటీ నాయకులు పందరం సోనేరావు, నల్లోల శ్రీనివాస్, పుడసం కైలాస్, అచ్చంతరావు, శిడం రామ్ పల్కు ఆత్రం భీమ్రావు ,మడవి నాగో రావు, సుంగన్న, కేశవ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు