Voditala Pranav: బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్

సిరాన్యూస్‌,జమ్మికుంట:
బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్
*  రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం…
* జమ్మికుంటలో ఘ‌నంగా ఉర్సు ఉత్సవాలు

బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గా లో మంగళవారం ఉర్సు ఉత్సవాలు భాగంగా గ్రంధాలను తీసుకువచ్చి హజ్రత్, సయ్యద్ ఇంకుషావలి సమాదులకు హుజూరాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ బిజిగిరి షరీఫ్ దర్గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడికి భక్తులు కులాలకు, మతాలకు, అతీతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం, విశ్వాసం అన్నారు. దర్గాకు వచ్చిన భక్తులకు కమిటీ వారు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. బాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, ఆనందంగా ఉండాలని, కోరుకున్నట్లు అయినా తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొన్నగంటి మల్లయ్య,కొల్లూరు కిరణ్, సుంకరి రమేష్, సజ్జు, మోలుగురి సదయ్య, సతీష్ రెడ్డి, పుల్లూరి సదానందం, సంపత్, రాహుల్, నాగభూషణం,కొమురయ్య, రాజ్ కుమార్, రాచపల్లి రమేష్, వెంకటరెడ్డి, రాందాస్, రాములు, మల్లేష్ , లతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *