సిరాన్యూస్, సైదాపూర్
రేపు సైదాపూర్ కు రానున్న వొడితల సతీష్ కుమార్
పార్లమెంట్ ఎన్నికలలో సందర్భంగా ఈనెల 24న సైదాపూర్ మండల కేంద్రానికి హుస్నాబాద్ నియోజక వర్గ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెల్మాల్ల రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద రాత్రి 7 గంటలకు రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో రావాలన్నారు.