సిరాన్యూస్,సైదాపూర్:
పిన్ రెడ్డి రాంరెడ్డి కుటుంబానికి రూ.2లక్షల చెక్కు అందజేత: మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
* కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం వెన్కేపల్లి-సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పిన్ రెడ్డి రాంరెడ్డి ప్రమాదవశాత్తు మరణించారు. అయితే భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామిని గా ఉన్న ఆయన భార్య పద్మకి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అందజేశారు. కార్యక్రమం లో రాష్ట్ర ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య, పోక్స్ అధ్యక్షుడు బిల్లా వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెల్మల రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాయిత రాములు, పోతరాజు సంపత్, తదితరులు ఉన్నారు.