సిరాన్యూస్, సైదాపూర్
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ జాగీర్ పల్లి గ్రామంలో ఆంధ్రజ్యోతి న్యూస్ రిపోర్టర్ బండారి గట్టయ్య తల్లి, బూడిదపల్లి గ్రామంలో దొనికెన రాజయ్య, వెన్నంపల్లి గ్రామంలో మారుపాక మహేష్ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. అనంతరం వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుడిని కోరారు. వారి కుటుంబాలకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. వారి వెంట ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.