ఓటు హక్కు వినియోగించుకున్నవొడితల ప్రణవ్

 సిరా న్యూస్,హుజురాబాద్;
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చేసింది.ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.హుజురాబాద్ మండలము సింగపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలం అధికంగా ఉండడం వలన ఓటర్లు తొందరగా పోలింగ్ బూత్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని,కొత్తగా వచ్చిన ఓటర్లు తమ యొక్క ఓటును భాద్యతగా వినియోగించుకోవాలని కోరారు.దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్కరూ తనవంతు బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *