సిరా న్యూస్, కోనారావుపేట:
కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ…
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కనగర్తి గ్రామంలో కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీని ఘనంగా నిర్వహించారు. సోమవారం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సంక్రాంత్రి పండగను పురస్కరించుకొని, నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 11 టీంలు పాల్గొన్నారు. కాగా బొమ్మెన సాయి నాయకత్వం వహించిన జై భీం టీం మొదతి స్థానంలో నిలిచి, విజయం సాధించగా, దొడ్డ సాయిదీప్ నాయకత్వం వహించిన దోస్తానా టీం రెండవ స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు కరీంనగర్ డెయిరీ పాలకవర్గం సభ్యులు బహుమతులు ప్రధానం చేసి, అభినందించారు. యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని అన్నారు.