మాజీ మంత్రి గుడివాడ కొడాలి నానిపై వలంటీర్ల ఫిర్యాదు…

కేసు నమోదు చేసిన పోలీసులు
 సిరా న్యూస్,గుడివాడ;
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేసారు.. దాంతో గుడువాడ పోలీసులు వైసీపీ నేతపై కేసు నమోదు చేసారు. నానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, మరో ఇద్దరు వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది. ఎన్నికలకు ముందు పలువురు వార్డు వలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. మాజీ వార్డు వలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *