చిగురుమామిడి, సిరా న్యూస్
ఓటుహక్కు నమోదు చేసుకోవాలి
ప్రతి ఒక్కరు ఓటుహక్కు నమోదు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు అప్పాల సమ్మయ్య అభిప్రాయపడ్డారు. గురువారం ఇందుర్తి గ్రామంలో ఆక్స్ ఫర్ల్ పాఠశాలలో ఓటరు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సన రమ్య, మైకేల్, సావిత్రి, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సి ఎచ్ జయప్రద ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉపాధ్యాయ బృందం , బి ఎల్ వో లు అంగన్వాడీ టీచర్స్, వార్డు సభ్యులు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు . పాఠశాల ఎచ్ ఎం మాట్లాడుతూ ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా లో కూడా ఓటు హక్కు లేని రోజుల్లో అంబేడ్కర్ ఈ దేశం లో మహిళలకు ఓటు హక్కు కల్పించారని కొనియాడారు.