సిరా న్యూస్,హైదరాబాద్;
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా ప్రవేశ పెట్టడం అయిష్టంగా ఉందన్నారు భట్టి. కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకువాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులు సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉపయోగించుకోవాలనే స్పష్టత ఉంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్థి స్థాయి బడ్జెట్లో వివిధ రంగావారిగా కేటాయింపులు జరిగినప్పుడే, మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతామన్నారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెట్టినప్పుడే రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశ పెడతుందన్నారు. ఈ బడ్జెట్ లక్ష్యం ఒక్కటే అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం సమగ్రంగా అభివద్ధి చేయడమే అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా ఆరు గ్యారంటీలను తూజా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీనులను అభివృద్ధి చేస్తామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అత్యంత ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధిస్తామన్నారు. గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించారు. ప్రణాళిక లేకుండా, హేతుబద్దత లేకుండా వారు చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాళ్లుగా మారాయి. అయితే ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో, సహేతుకమైన కార్యచరణతో ఈ సవాళ్లను అధిగమిస్తామన్నారు. దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు భట్టి. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిరర్ధకమైన ఆస్తులు పెంచుకుటూ వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయడం మా విధానం కాదన్నారు. కేవలం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందడం, వారు సంతోషంగా ఉండటం మాత్రమే మా లక్ష్యం అన్నారు. దీనికి అనుగుణంగానే తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని బడ్జెట్లో ప్రతిపాదనలు చేశామన్నారు.