జై కిసాన్ స్వాతంత్ర సమరయోధులు. ఎరుకల రాజన్న
సిరా న్యూస్,కమాన్ పూర్;
భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ పై ఉందని జై కిసాన్ స్వాతంత్ర సమరయోధులు పాలకుర్తి మండలం రానాపూర్ కి చెందిన ఎరుకల రాజయ్య పేర్కొన్నారు.
బిజెపి పార్టీ పువ్వు గుర్తుకు ఓట్లు వేస్తే రాజ్యాంగమును బిజెపి వాళ్లు మారుస్తారు ! రాజ్యాంగం లేకపోతే ప్రజల బతుకులు ఆగమైపోతాయి ! బిజెపి పార్టీకి ఓట్లు వేయమని చెప్పే నాయకులందరూ భారత రాజ్యాంగం ద్రోహులే ! ఈ రాజ్యాంగ ద్రోహులను ప్రజలు తిప్పికొట్టాలి , గ్రామాలనుంచి బహిష్కరించాలి !
ప్రస్తుతం భారతదేశంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లో లో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ఎన్నికలను రెండు రకాలుగా మనం పరిశీలించాలి ! ఇండియా కూటమి ఒకవైపు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది !రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి మోడీ కంటే దేశాన్ని అభివృద్ధి చేసి చూపుతా అని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాగ్దానం చేస్తుంది ! అట్లాగే ఎన్ డి ఏ కూటమి బిజెపి నరేంద్ర మోడీ , అమిత్ షా , భారత ప్రజలు బిజెపికి 400 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించండి భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని సమూలంగా మేము మారుస్తాం అనే సింగల్ ఏకైక ఏజెండాతో బిజెపి ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వస్తుంది ! ఈ రెండు పార్టీల విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సున్నితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ! కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు భారతదేశన్ని పరిపాలించింది కానీ ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కరించడంలో విఫలమైంది అందుకే కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు బిజెపి పార్టీకి అధికారాన్ని అప్పజెప్పారు , ఈ పది సంవత్సరాల బిజెపి పాలనను మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ! భారతదేశంలో విద్య వైద్యం పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ధారా దత్తం చేసింది , దేశంలో నిత్యవసర సరుకులు ఎన్నడూ లేనంత పెంచింది , సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు , ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని బిజెపి ప్రభుత్వం దేశంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుంది , బిజెపి పార్టీ ప్రైవేట్ కారణమూలంగా ! భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి అంశం డిఫెన్స్ అంటే మిలటరీ రంగానికి సంబంధించింది , ఆ మిలటరీ రంగాన్ని కూడా అడ్డ కూలీల స్థాయికి దిగజారిసింది బిజెపి పార్టీ , అంటే మిలిటరీ రిక్రూట్మెంట్ స్థానంలో అగ్నిపతి అనే ఒక పేరుతో ఎవరి పడితే వారిని ఎలాంటి ఫిట్నెస్ లేకుండా ఉన్న వ్యక్తులను కూడా రిక్రూట్ చేసుకొని దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిలే విధంగా బిజెపి ప్రభుత్వం పూనుకున్నది ! భారతదేశంలో రాజ్యాంగ పరిధిలో మాట్లాడుతున్న , పోరాడుతున్న ప్రశ్నిస్తున్న ప్రజలను , వ్యక్తులను సామాజిక కార్యకర్తలను ప్రతిపక్ష నాయకులను ఊపా కేసుల పేరుతో వేలాది మందిని జైల్లో పెట్టింది బిజెపి ప్రభుత్వం ! మరొకసారి బిజెపి పార్టీని భారతదేశంలో ప్రజలు ఓట్లు గనక వేస్తే ఎక్కువ నష్టం హిందూ ప్రజలకే జరుగుతుంది ! వ్యవసాయ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తారు ! వ్యవసాయ బాయులకు మీటర్లు బిగించి రైతుల నుండి ముక్కు పిండి కరెంటు బిల్లులు వసూలు చేస్తారు ! అంటే వ్యవసాయం చేసే సంఖ్య భారతదేశంలో ఒకరకంగా హిందువుల సంఖ్య ఎక్కువ ఉంది ! అంటే మళ్ళీ బీజేపీ గెలిస్తే హిందూ రైతులకే ఎక్కువ నష్టం జరుగుతుంది, అందుకే హిందూ ఓటర్లు బిజెపి పార్టీ మూర్ఖ మైన విధానాలను వ్యతిరేకించి బిజెపిని ఓడించవలసిన బాధ్యత హిందూ ప్రజలపైనే ఉంది ! నిజం నిజం రోజు నిజం మీ ధైర్యం — భారత ప్రజల మిత్రుడు ఎరుకల రాజన్న ! జై కిసాన్ జై స్వతంత్ర సమరయోధులు 9912776640 తన నెంబర్ పేర్కొన్నారు.
========================xxx